ప్రజల ముంగిట ఆర్టీసీ సేవలు | Sakshi
Sakshi News home page

ప్రజల ముంగిట ఆర్టీసీ సేవలు

Published Fri, Jun 23 2023 1:36 AM

విద్యార్థులకు బస్‌పాస్‌లు అందిస్తున్న డీఎం - Sakshi

దేవరుప్పుల: లాభాపేక్ష లేకుండా ప్రజల ముంగిట ఆర్టీసీ సేవలు కొనసాగిస్తున్నట్టు ఆ సంస్థ జనగామ డిపో మేనేజర్‌ జ్యోత్స్న అన్నారు. గురువారం స్థానిక బాలయేసు ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌ బాలికలకు ఆర్టీసీ ఉచిత బస్‌ పాస్‌లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు ఆర్టీసీ సేవలు అందించే క్రమంలో ప్రయాణికుల ఆదరణ ఉంటేనే సర్వీసులు కొనసాగించగలుగుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులతో పాటు ట్రాన్స్‌ఫోర్టు సేవలందిస్తున్న ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ బ్రదర్‌ జేసురాజు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

జనగామ డిపో మేనేజర్‌ జ్యోత్స్న

Advertisement
Advertisement