వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలి.. | Sakshi
Sakshi News home page

వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలి..

Published Thu, Nov 9 2023 1:54 AM

కార్యకర్తలతో రాష్ట్ర అధ్యక్షుడు ఐలుమల్లు - Sakshi

నర్మెట: వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడంతోపాటు వారి ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలుమల్లు డిమాండ్‌ చేశారు. జనగామ పట్ట ణ అధ్యక్షుడు డి.రాజు అధ్యక్షతన బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షల వడ్డెర జనాభా ఉన్నా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్‌గానే చూస్తూ.. ఏడు దశాబ్దాలుగా ఏప్రభుత్వమూ వడ్డెరల అభివృద్ధికి తోడ్పాటు అందించలేదన్నారు. ఎస్టీల్లో చేర్చడంతోపాటు అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చే పార్టీకే ఎన్నికల్లో మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శివరాత్రి మహేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శివరాత్రి రవి, ప్రధాన కార్యదర్శిగా బందారపు కుమార్‌, ఉపాధ్యక్షులుగా శివరాత్రి రవి, వెంకటేష్‌, కార్యదర్శిగా వల్లెపు కుమార్‌, కోశాధికారిగా శివరాత్రి రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బోదాసు దేవేంద్ర, ప్రచార కార్యదర్శిగా వల్లెపు ప్రదీప్‌, కార్మి క సంఘం అధ్యక్షుడిగా అల్లెపు రాజేష్‌, యూత్‌ అధ్యక్షుడిగా శివరాత్రి దేవేందర్‌ ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తిరి గణేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు బందారపు కుమార్‌ పాల్గొన్నారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలుమల్లు

Advertisement
Advertisement