జనగామ రూరల్: విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి కె.రాము అన్నారు. బుధవారం ఎన్సీఆర్టీ పాపులేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోల్ ప్లే పోటీలు పట్టణంలోని ధర్మకంచ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థిలో ఏదో ఒక కళ నిక్షిప్తమై ఉంటుంద ని, దానిని వెలికితీసి ప్రతిభను గుర్తించడం వల్ల ఆ రంగంలో రాణించగలుగుతారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో 12 మండలాల నుంచి 55 మంది విద్యార్థులు పాల్గొనగా తరిగొప్పుల కేజీబీవీ మొదటి స్థానం, చిల్పూర్ రెండో స్థానం, సింగరాజుపల్లి జెడ్పీఎస్ఎస్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచినట్లు నిర్వాహకులు జి.శ్రీనివాస్రావు తెలిపారు. గెలు పొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు కార్యక్రమంలో అఽధికారి గౌసియా తదితరులు పాల్గొన్నారు.