రథోత్సవం | Sakshi
Sakshi News home page

రథోత్సవం

Published Sun, Dec 3 2023 1:34 AM

-

లింగాలఘణపురం: మండలంలోని జీడికల్‌లో 1వ తేదీన సీతారామచంద్రుల కల్యాణోత్సవ అనంతరం శనివారం రాత్రి రథోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవ విగ్రహాలను రథంపై ఏర్పాటు చేసి రంగురంగుల పూలతో అలంకరించారు. యాగ్నికులు శ్రీనివాసాచార్యులు, విజయసారథి ఆధ్వర్యంలో హోమం నిర్వహించిన అనంతరం భక్తులు సీతా రామచంద్రుల ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. టపాకాయలు కాల్చుతూ డో లువాయిధ్యాలతో భక్తులు నాట్యాలు చేస్తూ ఊరేగించిన అనంతరం ఆలయం వద్దకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఈఓ శేషుభారతి, జూనియర్‌ అసిస్టెంట్‌ రాములు, ఆలయ అర్చకులు భార్గవాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు, రాఘవాచార్యులు, బుచ్చయ్య శర్మ, భరత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement