రిటైర్డ్‌ ఉద్యోగుల నిరసన దీక్ష | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఉద్యోగుల నిరసన దీక్ష

Published Tue, Apr 11 2023 1:26 AM

కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు   - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీఆర్‌ మోహన్‌ మాట్లాడుతూ.. ఈహెచ్‌ఎస్‌ అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే విధంగా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, హెచ్‌ఆర్‌ఏ బకాయిలు చెల్లి ంచాలని కోరారు. వైద్య బిల్లులు చెల్లించాలని, 65 సంవత్సరాల నుంచి అదనపు పెన్షన్‌ పెంచాలని, ఆదాయపన్ను నుంచి మినహాయింపు కల్పించాలని, ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు చెల్లించాలని కోరారు. నూతన పీఆర్‌సీ అమలు చేయాలని, ప్రతి ఏడాది డిసెంబర్‌ 17న అఖిల భారత పెన్షనర్స్‌ డే నిర్వహించాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ భవేష్‌మిశ్రాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్ట రామచంద్రమూర్తి, అయిలయ్య, నాయకులు ధరమ్‌సింగ్‌, రాజమౌళి, నారాయణరెడ్డి, రాజయ్య, రామ్‌నాయక్‌, పోచయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement