ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన పూజలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన పూజలు ప్రారంభం

Published Wed, Sep 13 2023 1:26 AM

శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న పండితులు - Sakshi

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయం శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన పూజలు వేదపండితుల మంత్రోచ్చరణలతో వైభవోపేతంగా ప్రారంభం చేశారు. మంగళవారం సాయంత్రం మంగళవాయిద్యాలతో గణపతి పూజకార్యక్రమాలతో ప్రారంభించారు. నేడు ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్‌, దేవస్థానం చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావు, ధర్మకర్తలు సమ్మయ్య, రాంరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాజయ్య, సిద్దాంతి భాపుప్రకాశ్‌ పద్మ, దేవెందర్‌,అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement