నర్సింహులపేట: బీజేపీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా సంగీత ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, స్వామి వివేకానందా విగ్రహ ప్రహరీ, కరెంట్ స్తంభాలకు అభ్యర్థి ప్రచార పోస్టర్ అంటించారు. ప్రచారాలకు ప్రభుత్వ ఆస్తులను వాడుకోవడంతో పలువురు యువకులు శనివారం గమనించి సీ–వీఐజీఐఎల్ ఐడీ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎన్నికల అధికారి కేశవరావు, ఎఫ్ఎస్టీ టీం అధికారి రాజలింగం ఘటనా స్థలిని పరిశీలించారు. రుజువు కావడంతో బీజేపీ అభ్యర్థి సంగీతపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు.
యువకుడి మృతి
ములుగు రూరల్: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలంలోని పత్తిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన పోరిక సురేష్ (25) తన తల్లి ఇంట్లో దుస్తులు ఉతికి తీగపై ఆరేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురైంది. తల్లిని రక్షించే క్రమంలో సురేష్ కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇద్దరు స్పృహ కోల్పోయారు. కొంత సమయం తర్వాత తల్లి తేరుకుంది. సురేష్ తేరుకోకపోవడంతో గమనించిన కుటుంబీకులు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. సురేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు.