బహుముఖ ప్రజ్ఞాశాలి రామయ్య | Sakshi
Sakshi News home page

బహుముఖ ప్రజ్ఞాశాలి రామయ్య

Published Sat, Apr 20 2024 1:55 AM

రామయ్యను సన్మానిస్తున్న డీఈఓ  - Sakshi

ములుగు రూరల్‌: మండలంలోని అబ్బాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కందాల రామయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. కందాల రామయ్య ఇటీవల ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ(మనోవిజ్ఞాన శాస్త్రం) పట్టా పొందగా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అబ్బాపూర్‌ పాఠశాలలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యాశాఖలో రామయ్య రిసోర్స్‌ పర్సన్‌, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రణాళికల రూపకల్పనలో సేవలు అందించారన్నారు. రామయ్య పీహెచ్‌డీ పట్టా పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ జయదేవ్‌, గణిత పోరం జిల్లా అధ్యక్షుడు ఎళ్ల మధుసూదన్‌, డీసీఈబీ సహాయ కార్యదర్శి విక్రమ్‌ రాజ్‌, ప్రధానోపాధ్యాయుడు భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement