చట్టాలపై అవగాహన తప్పనిసరి | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 2 2023 8:04 AM

వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ సృజన  - Sakshi

గద్వాల క్రైం: చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో బుధవారం కళాజాత కార్యక్రమాన్ని ఎస్పీ సృజన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్‌, మహిళ, రోడ్డు ప్రమాదాలు, చీటింగ్‌, వేధింపులు, అత్యాచార, బాల్య వివాహాలు తదితర చట్టాలపై జిల్లాలోని ప్రజలందరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. చట్టాలు తెలియకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు, ఒప్పందాలతో భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. అక్షరాస్యులు కాని కారణంగా చట్టాలపై నమ్మకం లేకపోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా కళాజాత బృందం, షీ టీం సభ్యులచే జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర సమయల్లో డయల్‌ 100కు ఫోన్‌ చేయాల్సిందిగా వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది రజిత, దివ్య, హన్మంతు తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement