అభిమానుల మధ్య మంత్రి రాజా జన్మదిన వేడుకలు
జన్మదిన
వేడుకల్లో
మంత్రి
దాడిశెట్టి రాజా
తుని: తెలుగు ప్రజల పండగ ఉగాది వేళ అందరూ సంతోషం, రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆకాంక్షించారు. బుధవారం తుని మండలం ఎస్.అన్నవరం క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకులు అభిమానుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు తుని నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికకావడం అదృష్టమన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషమని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఎంపీ వంగా గీత, తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి, తుని మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినీడి బాబు, లోవ దేవస్థానం చైర్మన్ గొర్లి అచ్చియ్యనాయుడు, ఎంపీపీ బొప్పన రాము, లగుడు శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యురాలు పోతల సూర్యామణి, డీసీసీబీ డైరెక్టర్ పోలిశెట్టి సోమరాజు, గాంధీ సత్రం చైర్మన్ అనిశెట్టి సూర్యచక్రరెడ్డి, ఏలూరి బాలు, పోతుల లక్ష్మణ్ పాల్గొన్నారు.