ఖైదీ మృతిపై ఐదో తేదీన మెజిస్టీరియల్‌ విచారణ | Sakshi
Sakshi News home page

ఖైదీ మృతిపై ఐదో తేదీన మెజిస్టీరియల్‌ విచారణ

Published Thu, Aug 31 2023 2:20 AM

- - Sakshi

కాకినాడ సిటీ: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఖైదీ మృతిపై వచ్చేనెల ఐదో తేదీన మెజిస్టీరియల్‌ విచారణ నిర్వహించనున్నట్టు ఆర్డీఓ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. డిటెన్యూ ఖైదీగా ఉన్న గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన బొంతు రమణ అనారోగ్యంతో జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతూ 2022, సెప్టెంబర్‌ 27న మరణించారని ఆయన తెలిపారు. ఈ విషయమై స్థానిక వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు మెజిస్టీరియల్‌ విచారణ నిర్వహించనున్నట్టు తెలిపారు. మృతుని రక్త సంబంధీకులకు, బంధువులకు, పోలీసులకు, వైద్యులకు, విచారణకు హాజరయ్యేలా నోటీసులు జారీ చేసినట్లు ఆర్డీవో తెలిపారు. ఐదో తేదీ ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరు కావాలన్నారు.

Advertisement
Advertisement