Sakshi News home page

14న ప్రైమ్‌ మినిస్టర్‌ మేళా

Published Wed, Nov 8 2023 11:38 PM

-

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 14వ తేదీన ప్రైమ్‌ మినిస్టర్‌ అప్రెంటిస్‌ మేళా–2023 నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ వర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడతో పాటు కొనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ కంపెనీల్లో అప్రెంటిస్‌ పోస్టులు భర్తీ చేయడానికి ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 86392 30775 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement