వంగ వీటి మోహనరంగా వర్థంతి సందర్భంగా | Sakshi
Sakshi News home page

వంగ వీటి మోహనరంగా వర్థంతి సందర్భంగా

Published Thu, Nov 30 2023 2:26 AM

రంగనాడు సభ విజయవంతం చేయాలంటూ  ఐక్యత చాటుతున్న  నాయకులు - Sakshi

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వంగ వీటి మోహనరంగా వర్థంతి సందర్భంగా డిసెంబర్‌ 26న కాకినాడలో రంగనాడు పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాధా రంగా రాయల్‌ అసోషియేన్‌ అధ్యక్షులు గాదె బాలాజీ పేర్కొన్నారు. కాకినాడలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ఒక వర్గానికో లేక ఒక కులానికో చెందిన వ్యక్తి కాదన్నారు. ,కుల మతాలకు అతీతంగా అభిమానించదగ్గ నాయకుడన్నారు. రంగా ఆశయాలు నేటి తరానికి తెలియజేస్తూ ముందుకు వెళ్లాలని గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ సారి కాకినాడలో భారీ స్దాయిలో సభ నిర్వహిస్తామన్నారు. అన్ని వర్గాల వారూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. సంఘ గౌరవ అధ్యక్షులు సాయి సుధాకర్‌నాయుడు, రాష్ట్ర దళిత నాయకులు కామేశ్వరరావు,కాపు సంఘ నేతలు నాగబాబు,మహేష్‌,చంటిబాబు,తడాల గంగాధర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement