అనుమానాస్పద స్థితిలో మృతిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మృతిపై కేసు నమోదు

Published Tue, Dec 5 2023 5:08 AM

-

రాయవరం: స్థానిక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిపై కేసు నమోదు చేసినట్లు రాయవరం ఎస్సై జి.నరేష్‌ విలేకరులకు తెలిపారు. రాయవరం గ్రామానికి చెందిన రండి రాంబాబు(50) ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పదేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్న రాంబాబు మద్యానికి బానిసై, చెడు వ్యసనాలకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో మానసిక వేదనతో విషాన్ని తాగడంతో మృతి చెందాడని ఎస్సై నరేష్‌ తెలిపారు. రాంబాబు కుమారుడు వీరదివాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితి మృతి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement