వైభవంగా శివపార్వతుల కల్యాణం | Sakshi
Sakshi News home page

వైభవంగా శివపార్వతుల కల్యాణం

Published Tue, Dec 5 2023 5:08 AM

లలితా కుంకుమార్చనకు హాజరైన మహిళలు  - Sakshi

కాకినాడ శ్రీపీఠంలో మారేడుదళాలతో పూజ

వర్షాన్ని లెక్కచేయక తరలివచ్చిన మహిళలు

కాకినాడ రూరల్‌: మహాశక్తి యాగం కార్యక్రమంలో భాగంగా కాకినాడ రమణయ్యపేట శ్రీపీఠంలో సోమవారం శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. లలితా కుంకుమార్చనలు, వేదికపై పంచలోహ దివ్యమూర్తులైన శివపార్వతులకు కల్యాణం, మారేడుదళాలతో పత్రి పూజను పరిపూర్ణానంద స్వామిజీ నిర్వహించారు. తుపాను ప్రభావంతో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నా, లెక్కచేయని మహిళలు శత కోటి లలితా కుంకుమార్చన యాగంలో పాల్గొన్నారు. 21వ రోజున భక్తులనుద్దేశించి పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ లలితా సహస్ర నామాలు చాలా విశిష్టమైనవని, అమ్మవారిని పూజిస్తే అన్నీ ప్రసాదిస్తుందన్నారు.

1/1

Advertisement
Advertisement