● వివరాలు వెల్లడించిన పోలీసులు
● భర్త హోమ్సింగ్ అరెస్టు
మాక్లూర్: ఈ నెల 7న మండలంలోని అమ్రాద్తండాలో జరిగిన మాలోత్ పింకూ (26)ది ఆత్మహత్య కాదని, ఆమె నిద్రలో ఉండగా భర్త హోమ్సింగ్ ఆమె మెడకు తాడుతో ఉరి బిగించి హత్య చేశాడని నిజామాబాద్ నార్త్జోన్ సీఐ నరహరి పేర్కొన్నారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పింకూ ఆత్మహత్య చేసుకోలేదని అత్త పీరుబాయి, భర్త హోమ్సింగ్లే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరిస్తున్నారంటూ మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దీంతో విచారణ కోసం గురువారం ఉదయం అమ్రాద్ తండా వెళుతుండగా పోలీసులను గమనించిన హోమ్సింగ్ తప్పించుకోనే ప్రయత్నం చేయటంతో అక్కడే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పింకూ భర్త హోమ్సింగ్ను 6నెలలుగా శారీరకంగా దూరం ఉంచుతుందన్న విషయమై ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరగడంతో కుల పెద్దలు రాజీ చేసి వెళ్లినట్టు తెలిపారు. అంతలోనే పింకూ గర్భవతి అని తెలియడంతో ఆమైపె అనుమానం పెంచుకుని, ఈ నెల 7న తెల్లవారు జామున నిద్రలో ఉండగానే నైలాన్ తాడుతో ఉరి బిగించి హత్య చేసినట్టు విచారణలో వెల్లడించారన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఎస్సై యాదగిరిగౌడ్, సిబ్బంది ఉన్నారు.