డబ్బుల కోసం తల్లిపై దాడి | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం తల్లిపై దాడి

Published Wed, Mar 15 2023 12:34 AM

-

భిక్కనూరు: డబ్బుల కోసం తల్లితో గొడవపడి కల్లు సీసాతో దాడి చేశాడో కొడుకు. ఈ ఘటన మంగళవారం మండలంలోని జంగంపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై ఆనంద్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాగని సత్తవ్వ తన కుమారుడు అశోక్‌తో కల్సి నివసిస్తుంది. శుక్రవారం ఉదయం డబ్బుల విషయమై తల్లి కోడుకులు గొడవ పడ్డారు. డబ్బులు ఇవ్వకపోవడంతో అశోక్‌ ఇంట్లో ఉన్న కల్లు సీసాతో సత్తవ్వ వీపుపై దాడిచేశాడు. దీంతో సత్తవ్వకు తీవ్ర రక్తస్రవం అయ్యింది. వెంటనే గ్రామస్తులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు.

కారు నడుపుతుండగా ఛాతీలో నొప్పి

నవీపేట: నవీపేట మార్కండేయ ఆలయ సమీపంలో మంగళవారం కారులో వెళ్తున్న బోధన్‌ మండలం సంగెం గ్రామానికి చెందిన మనోహర్‌రెడ్డికి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని, పోలీస్‌స్టేషన్‌ ప్రహరీని ఢీకొంది. ప్రమాదంలో యువతికి స్వల్ప గాయాలు అయ్యాయి.

Advertisement
Advertisement