సమాజాన్ని జాగృతపర్చడానికి నైపుణ్యం అవసరం | Sakshi
Sakshi News home page

సమాజాన్ని జాగృతపర్చడానికి నైపుణ్యం అవసరం

Published Tue, May 2 2023 12:10 AM

సర్టిఫికెట్‌ అందిస్తున్న మేయర్‌ నీతూకిరణ్‌  - Sakshi

ఖలీల్‌వాడి: సమాజాన్ని జాగృత పర్చడానికి నైపుణ్యం అవసరమని నగర మేయర్‌ నీతూకిరణ్‌ అన్నారు. సోమవారం నగరంలోని కిసాన్‌ గంజ్‌లోని ఓ హోటల్‌లో ట్రెయిన్‌ ది ట్రెయినర్స్‌ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. నీతూకిరణ్‌ మాట్లాడుతూ ఇంఫాక్ట్‌ సర్టిఫైడ్‌ ట్రైనర్‌ ఒకప్పుడు హైదరాబాద్‌కు పరిమితమైందని, ఇప్పుడు నిజామాబాద్‌కు రావడం సంతోషదాయకమన్నారు. ఇంటికొక స్పీకర్‌ – ఊరుకొక ట్రెయినర్‌ అనే ఆశయ సాధనలో భాగంగా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ ట్రెయినర్‌ పుజ్జ నరేందర్‌ తెలిపారు. లాబిశెట్టి మహేష్‌, నక్క నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement