చికిత్స పొందుతూ మహిళ.. | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మహిళ..

Published Sun, May 28 2023 12:44 AM

-

నిజాంసాగర్‌(జుక్కల్‌): అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని తెల్గాపూర్‌ గ్రామా నికి చెందిన పున్న పార్వతి(40)ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చలేదు. అలాగే యాసంగి పంట వడగండ్ల దాటికి నేలరాలడంతో మనోవేదనకు గురైంది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 24న ఆమె ఒంటిపై డీజిల్‌ పోసుకొని నిప్పంటించుకుంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబీకులు బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. శనివారం అస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement