ఇందల్వాయి: మండలంలో ని గండితండా గ్రామ పంచాయతీకి చెందిన పాల్ద్య బాబురావు(44) పొ లం వద్ద విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వివరాలు.. బాబురావు తన పొలం వద్ద విద్యుత్ వైర్లు బిగించేందుకు సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకున్నాడు. వైర్లు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు వి ద్యుత్ సరఫరా జరిగి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇదిలా ఉండగా బాబురావు ఎల్సీ రిట ర్న్ చేయకుండానే అధికారులు విద్యుత్ సరఫరా చేశారని తండావాసులు ఆరోపించారు. ఈ విష యంపై అధికారులను వివరణ కోరగా బాబురావు ఫోన్చేసి ఎల్సీ రిటర్న్ చేస్తున్నట్లు చెప్పాకే విద్యుత్ సరఫరా చేశామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాబురావు అన్న కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి ..
జక్రాన్పల్లి: మండలంలోని తొర్లికొండలో గుర్తు తెలియని వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి సమీపంలోని తోటలో ఒక వ్యక్తి మరణించి ఉండడాన్ని గ్రామస్తులు గమనించారన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. దీంతో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. సదరు వ్యక్తి మూడు రోజులుగా గ్రామంలో తిరుగుతూ కనిపించాడని గ్రామస్తులు తెలిపారన్నారు. మృతదేహాన్ని పరిశీలించి వడదెబ్బతో వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించామన్నారు.