విద్యుత్‌షాక్‌తో గేదెలు మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో గేదెలు మృతి

Published Wed, Jun 7 2023 12:42 AM

వేల్పూర్‌లో విద్యుత్‌షాక్‌తో మరణించిన గేదెలు - Sakshi

వేల్పూర్‌: మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం మేరెవార్‌ నారాయణ అనే రైతుకు చెందిన రెండు పాడి గేదెలు, ఒక పోతు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నారాయణ తనకు ఉన్న సుమారు 20 గేదెల ను, పోతును నిత్యం సొంతంగా మేపుకుంటాడు. ఈక్రమంలో వేల్పూర్‌ మైనర్‌కుంట వైపు గడ్డి ఉందని గ్రామస్తులు తెలుపడంతో అటువైపు గేదెలను మేపడానికి తీసుకెళ్లాడు. ఆదివారం సాయంత్రం భారీ గాలులతో కూడిన వర్షానికి విద్యుత్‌ వైర్లు తెగిపోయి పొలాల్లో పడ్డాయి. అప్పట్నుంచి అటు వైపు ఎవరూ వెళ్లకపోవడంతో తెగిన కరెంటు వైర్ల ను ఎవరూ గమనించలేదు. దీంతో మేతకు వెళ్లిన గేదెలు, పోతు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాయి. ఘటనా స్థలాన్ని మండల పశువైద్యాధికారి సంతోష్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ యశ్వంత్‌రావు పరిశీలించారు. సుమారు రూ. 2లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయారు.

Advertisement
Advertisement