పిట్లం(జుక్కల్): మండలంలోని పోతురెడ్డిపల్లి శివారులోని బొమ్మడి చెరువులో ప్రమాదవశాత్తు ఓ యువతి కాలుజారిపడడంతో మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తాండ వాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పోతురెడ్డిపల్లి తండాకు చెందిన శ్రీనివాస్ అన్షిబాయిల కుమార్తె ప్రియాంక (19) బుధవారం గేదెలకు నీరు తాగించేందుకు చెరువుకు వెళ్లగా ప్రమాదవశాత్తు పడి మృతి చెందిందన్నారు. చెరువులో ప్రియాంక కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన ఓ యువకుడు తండావాసులతో కాపాడినా అప్పటికే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
యువతి అదృశ్యం
ఖలీల్వాడి: నగరంలోని ఖలీల్వాడిలో ఆసుపత్రికి వచ్చిన మతిస్థిమితం లేని యువతి అదృశ్యమైనట్లు ఎస్హెచ్వో విజయ్బాబు తెలిపారు. జగిత్యాల జిల్లా వేములకుర్తి గ్రామానికి చెందిన గంగానర్సు మతిస్థిమితం లేని తన కుమార్తెతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ వద్ద చూయించుకున్న తర్వాత మందులు తీసుకునే సమయంలో యువతి అదృశ్యమైంది. చుట్టుపక్కల ఎక్కడా వెతికినా ఆచూకీ లభించలేదు. గంగానర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
బైకుల స్వాధీనం
డిచ్పల్లి: డిచ్పల్లి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బైక్లు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపారు. బోధన్కు చెందిన షేక్ సోహేల్, రాకాసిపేట్కు చెందిన సయ్యద్ జమీల్ బుధవారం ఉదయం 4.30 గంటలకు నంబర్ప్లేట్ లేని బైక్పై నిజామాబాద్ నుంచి డిచ్పల్లి వైపు వెళ్తుండగా రైల్వేస్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న ఎస్సై వారిని విచారించారు. వీరిపై అనుమానం రావడంతో విచారణ చేపట్టగా చోరీ చేసినట్లు నిందితులు తెలిపారు. అనంతరం వీరి నుంచి 12 పల్సర్ బైక్లు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఒక ఆక్టివాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితులను పట్టుకున్న ఎస్సై మహేశ్, సిబ్బంది సుధాకర్, రాజేశ్వర్, సర్దార్, రాము, సందీప్ను సీపీ సత్యనారాయణ, ఏసీపీ కిరణ్కుమార్, సీఐ కృష్ణ అభినందించారు.
నిందితుడికి రిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): డబ్బుల కోసం అమ్మమ్మను హత్యచేసిన బాలపోశయ్యను బాన్సువాడ పట్టణ పోలీసులు బుధవారం రిమాండ్కు తరలించారు. నిజాంసాగర్ మండలం తెల్గాపూర్కు చెందిన దుంపల అక్కవ్వ(70)ను ఈ నెల 11న బాలపోశయ్య హత్య చేసి పారిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.