చోరీకి పాల్పడిన వ్యక్తి పట్టివేత | Sakshi
Sakshi News home page

చోరీకి పాల్పడిన వ్యక్తి పట్టివేత

Published Thu, Oct 5 2023 1:34 AM

పోలీసుల అదుపులో అనుమానితుడు  - Sakshi

భిక్కనూర్‌: తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించిన సంఘటన మండలంలోని జంగంపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామంలో అద్దెకు ఉంటున్న రాజు ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితం వేరే గ్రామానికి వెళ్లాడు. బుధవారం వేకువజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గ్రామానికి వచ్చి ఇకరు ఇంట్లోకి ప్రవేశించగా మరొకరు బైక్‌వద్ద ఉన్నారు. ఇంట్లో చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్‌కు చెందినవాడిగా గుర్తించారు. విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement