రుద్రూర్: కోటగిరి మండలం లింగమయ్య గుట్ట సమీపంలో పోతంగల్ మండలం జల్లాపల్లి ఆబాదికి చెందిన మహ్మద్ హుస్సేన్ (53) మృతదేహం లభ్యమైంది. మృతదేహం కాలిపోయి ఉన్నందున దుండగులు హత్య చేసి కాల్చివేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. జల్లాపలి్ల్ ఆబాదికి చెందిన హుస్సేన్ కుటుంబ కలహాలతో రెండేళ్లుగా వర్నిలో ఉంటున్నాడు. ఈ నెల 8న హుస్సేన్ కనబడడం లేదని ఆయన కుమారుడు కమర్ హుస్సేన్ ఫిర్యాదు చేశాడు. గురువారం లింగమయ్య గుట్ట సమీపంలో మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి విచారణ చేపట్టారు. మృతుడి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
తల్లీకూతుళ్ల అదృశ్యం
ఖలీల్వాడి: నగరంలోని రెండో టౌన్ పీఎస్ పరిధిలో తల్లీకూతుళ్లు అదృశ్యమైనట్లు ఎస్సై అశోక్ గురువారం తెలిపారు. అక్టోబర్ 29న కుటుంబసభ్యులందరు రాత్రి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం గదిలో నిద్రించిన భార్య లలిత, కూతుళ్లు అక్షర, చైత్రలు కనిపించకపోవడంతో భర్త, కుటుంబీకులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ పేర్కొన్నారు. ఎవరికైనా ఆచూకీ లభిస్తే పోలీసులుకు సమాచారం అందించాలన్నారు.
కేఆర్ సురేశ్రెడ్డికి ప్రథమ చికిత్స
ఆర్మూర్: పట్టణంలో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి నామినేషన్ ర్యాలీలో ప్రచార రథంపై నుంచి పడ్డ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయనను పట్టణంలోని పెర్కిట్లో ఉన్న ఎంజే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. కాలికి, చేతికి గాయాలు కావడంతో చికిత్స అనంతరం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిపోయారు.