పోతంగల్: ప్రజలు ప్రతి పక్ష పార్టీల నాయకులు మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి కోరారు. మండలంలోని సుంకిని, కొల్లూర్, పీఎస్ఆర్ నగర్, సోంపూర్, టాక్లీ, హెగ్డోలి, కారేగాం, చేతన్నగర్, హంగర్గాపారం, తిర్మలాపూర్ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టాక్లీ, పీఎస్ఆర్ నగర్లో పోచారానికి మద్దతుగా స్థానికులు ఏకగ్రీవ తీర్మాన ప్రతులను అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికొక సీఎం ఉంటారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసిందేం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గూర్చి వివరించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ అబిద్, రామిరెడ్డి, ఎంపీటీసీ అనంత విఠల్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ బాన్సువాడ
అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి