15 నామినేషన్ల తిరస్కరణ | Sakshi
Sakshi News home page

15 నామినేషన్ల తిరస్కరణ

Published Tue, Nov 14 2023 1:02 AM

మద్నూర్‌లో అభ్యర్థులతో మాట్లాడుతున్న 
రిటర్నింగ్‌ అధికారులు  - Sakshi

కామారెడ్డి క్రైం: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో వచ్చిన నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు సోమవారం పరిశీలించారు. 15 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను తిరస్కరించారు. కామారెడ్డిలో 6, ఎల్లారెడ్డిలో 2, జుక్కల్‌లో 5, బాన్సువాడలో 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కొందరూ అభ్యర్థులు ఒక్కటే నామినేషన్‌ దాఖలు చేయగా చాలామంది ఒకటి కన్నా ఎక్కువ సెట్లు వేశారు. అదనపు సెట్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. 112 మంది అభ్యర్థుల నామినేషన్లను ఓకే చేశారు. కామారెడ్డిలో 58, జుక్కల్‌లో 23, ఎల్లారెడ్డిలో 14, బాన్సువాడలో 17 మంది నామినేషన్లు ఆమోదం పొందాయని ఎన్నికల అధికారులు తెలిపారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువుందని పేర్కొన్నారు. ఉపసంహరణకు రెండు రోజుల గడువు ఉండడంతో ఆయా ప్రధాన పార్టీల రాజకీయ నేతలు స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.

112 నామినేషన్లకు ఆమోదం

15 వరకు ఉపసంహరణకు గడువు

Advertisement
Advertisement