ఖర్చులను పక్కాగా లెక్కించాలి | Sakshi
Sakshi News home page

ఖర్చులను పక్కాగా లెక్కించాలి

Published Tue, Nov 21 2023 1:16 AM

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల
వ్యయ పరిశీలకుడు పరా శివమూర్తి - Sakshi

కామారెడ్డి క్రైం: అభ్యర్థుల ఖర్చులను పక్కాగా లెక్కించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఖర్చునూ లెక్కించాలని ఎంసీఎంసీ, సోషల్‌ మీడియా, వ్యయ పరిశీలన నోడల్‌ అధికారులకు సూచించారు. అభ్యర్థులు ప్రచారాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే ప్రకటనలకు ముందస్తు అనుమతులు పొందినదీ, లేనిదీ పరిశీలించాలన్నారు. ప్రధానంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రకటనలకు అనుమతులు లేకపోతే వెంటనే నోటీసులు ఇచ్చి అభ్యర్థుల ఖర్చులో నమోదు చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎంసీఎంసీ కమిటీ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, సతీష్‌ యాదవ్‌, శాంతికుమార్‌, ప్రవీణ్‌, నోడల్‌ అధికారి కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement