ప్రజలు మార్పు కోరుకుంటున్నారు | Sakshi
Sakshi News home page

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

Published Tue, Nov 28 2023 2:08 AM

- - Sakshi

బాన్సువాడ రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌ సునామీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కొట్టుకు పోవడం ఖాయమని ఆ పార్టీ బాన్సువాడ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన టీపీసీసీ సభ్యులు కాసుల బాలరాజుతో కలిసి సోమేశ్వర్‌, దేశాయిపేట్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, గట్టుమీది గ్రామాల్లో చేపట్టిన బైక్‌ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ గెలిస్తే ప్రస్తుతం అమలు అవుతున్న పథకాలు, అభివృద్ధి పనులు ఏవీ కూడా ఆపమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో పలువురి చేరిక

బాన్సువాడ: బీర్కూర్‌ మండలం దామరంచ గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Advertisement
Advertisement