Sakshi News home page

వలస నేతలను నమ్మొద్దు

Published Tue, Nov 28 2023 2:08 AM

ఎల్పుగొండలో మాట్లాడుతున్న 
వెంకటరమణారెడ్డి - Sakshi

మాచారెడ్డి: తమ స్వార్థ ప్రయోజనాల కోసం వలసవచ్చి పోయే నేతలను నమ్మొద్దని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణారెడ్డి కోరారు. సోమవారం ఆయన పాల్వంచ, వాడి, ఎల్పు గొండ, మంథని దేవునిపల్లి గ్రామాల్లో ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా ఒకరు కొడంగల్‌, ఇంకొకరు ఫామ్‌ హౌజ్‌లో ఉంటారన్నారు. తాను లోకల్‌ అని, ఏ రాత్రి తలుపు తట్టినా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయని ఆరోపించా రు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా కామారెడ్డి లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నాల వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింహాచారి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

నేను లోకల్‌..

ఎప్పటికీ అందుబాటులో ఉంటా

ప్రచారంలో బీజేపీ అభ్యర్థి

వెంకటరమణారెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement