ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

Published Thu, Dec 21 2023 1:12 AM

వినతి పత్రం ఇస్తున్న ఉపాధ్యాయులు - Sakshi

ఎల్లారెడ్డిరూరల్‌(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పలు ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన సమావేశంలో వెటర్నరీ, అంగన్‌వాడి, వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సీడీపీవో సరిత, వెటర్నరీ ఏడీ సుభాష్‌ తదితరులున్నారు.

ఉపాధ్యాయుల వినతిపత్రం

ఎల్లారెడ్డిరూరల్‌(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. జీవో–317 ద్వారా స్థానికతను కోల్పోయామని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రభుత్వం జీవో– 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్థానిక జిల్లాలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు.

సమావేశం నిర్వహిస్తున్న మదన్‌మోహన్‌రావు
1/1

సమావేశం నిర్వహిస్తున్న మదన్‌మోహన్‌రావు

Advertisement
Advertisement