‘అంకితభావంతో పనిచేయాలి’ | Sakshi
Sakshi News home page

‘అంకితభావంతో పనిచేయాలి’

Published Thu, Dec 21 2023 1:12 AM

సూచనలిస్తున్న ఎస్పీ సింధు శర్మ - Sakshi

కామారెడ్డి క్రైం: అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సింధు శర్మ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నాచారు. లోక్‌ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా ఎక్కు వ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీఆర్‌బీ డీఎస్పీ మదన్‌లాల్‌, కామారెడ్డి డీఎస్పీ ప్రకాష్‌, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement