సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

Published Tue, Mar 28 2023 12:12 AM

-

కరీంనగర్‌: పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శనిగరపు రజనీకాంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తే నిరుద్యోగులు ఎంతో సంతోషంగా కోచింగ్‌ సెంటర్లలో వేలకు వేల ఫీజు లు చెల్లించి, సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ అవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి, ఇందుకు బాధ్యులైన వారిని కఠి నంగా శిక్షించాలని కోరారు. నోటిఫికేషన్‌ రద్దు వల్ల నష్టపోయిన ప్రతీ నిరుద్యోగ అభ్యర్థికి నెలకు రూ.20 వేలు ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్‌ స్పందించి, చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర గర్‌ల్స్‌ కన్వీ నర్‌ ఎం.పూజ, జిల్లా అధ్యక్షుడు గజ్జెల శ్రీకాంత్‌, సహాయ కార్యదర్శి కాంపెల్లి అరవింద్‌, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్‌, నాగుల శివ, నాయకులు పాల్గొన్నారు.

పేపర్‌ లీకేజీపై ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

Advertisement
Advertisement