సీఎం కేసీఆర్‌ పాలన మోసపూరితం | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ పాలన మోసపూరితం

Published Thu, Sep 7 2023 1:36 AM

గొర్రెల కాపరితో మాట్లాడుతున్న శకుంతల - Sakshi

రామడుగు: తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్‌ పాలనంతా మోసపూరితమని కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ చిగురు శకుంతల ఆరోపించారు. రామడుగు మండలంలోని దేశ్‌రాజ్‌పల్లిలో బుధవారం గొర్రెల కాపరి బీరయ్య దంపతులతో మాట్లాడారు. వారి జీవన విధానాన్ని తెలుసుకున్నారు. గొల్ల, కుర్మలకు గొర్రె ల పథకం కింద ముసలి గొర్రెలు ఇచ్చి, మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు మాధవి, నవ్య, గుండు బాబు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ శకుంతల

Advertisement
Advertisement