రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్‌ విద్యార్థినులు | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్‌ విద్యార్థినులు

Published Sun, Nov 12 2023 1:24 AM

విద్యార్థినులను అభినందిస్తున్న నరేందర్‌రెడ్డి - Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌): మహబూబ్‌నగర్‌లో నిర్వహించే ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ అండర్‌–19 బాలికల విభాగం పోటీలకు కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు విశ్వాని, నిహారిక, వర్షలు ఎంపికై నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థినులను పుష్పగుచ్ఛంతో సత్కరించి అభినందించారు. కరీంనగర్‌లో ఇటీవల జరిగిన ఎస్‌జిఎఫ్‌జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికవ్వడం సంతోషంగా ఉందని, రాష్ట్రస్థాయిలో సైతం రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని అకాంక్షించారు.

Advertisement
Advertisement