చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Published Sun, Nov 12 2023 1:24 AM

-

గొల్లపల్లి: మండలంలోని శ్రీరాములపల్లికి చెందిన చిల్ముల చిన్న గంగారాం (54) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై నరేశ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న గంగారాం ఈనెల 7న తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా శ్రీరాములపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు, ఇతరచోట్ల బలమైన గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య శ్యామల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement