ఓసీపీలో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు | Sakshi
Sakshi News home page

ఓసీపీలో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు

Published Wed, Nov 15 2023 1:44 AM

-

పరిస్థితి విషమం

గోదావరిఖని(రామగుండం): సింగరేణి సంస్థ రామగుండం డివిజన్‌–1 పరిధిలోని జీడీకే–5 ఓసీపీలో మంగళవారం ప్రమాదం జరిగింది. పీసీ పటేల్‌ ప్రై వేట్‌ ఓబీకి చెందిన వాహనం ఢీకొట్టడంతో ప్రైవేట్‌ బోలెరో నడుపుతున్న అంశాల శ్రావణ్‌ అనే ఎంవీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. క్వారీలోని ఫోర్‌సీ మ్‌ ఏరియాలో ఆ వాహనానికి సాంకేతిక సమస్య త లెత్తడంతో డ్రైవర్‌ ఆపి, పరిశీలిస్తున్నాడు. అదే సమయంలో ప్రైవేట్‌ ఓబీకి చెందిన తుఫాన్‌ వాహనాన్ని డ్రైవర్‌ రివర్స్‌లో తీసుకువచ్చి, ఢీకొట్టినట్లు అధి కారులు తెలిపారు. ఈ ఘటనలో శ్రావణ్‌ ప్రక్కటెముకలు విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికి త్స అనంతరం కరీంనగర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో శ్రావణ్‌ పరి స్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement