బీఎస్పీతోనే పేదల బతుకులు మారుతాయి | Sakshi
Sakshi News home page

బీఎస్పీతోనే పేదల బతుకులు మారుతాయి

Published Mon, Nov 20 2023 11:42 PM

మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ - Sakshi

ధర్మపురి: బీఎస్పీ ద్వారానే పేదల బతుకులు మారుతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. ముందుగా వివేకానంద చౌరస్తా నుంచి పటేల్‌ విగ్రహం వరకు రోడ్‌షో చేపట్టారు. పార్టీ అధినేత మాయావతి ఆదేశాల మేరకు తెలంగాణలో పోటీకి సిద్ధమయ్యామని తెలిపారు. బడ్జెట్‌లో బీసీల వాటా కోసం ప్రశ్నించేందుకు.. కులగణన ఎందుకు చేపట్టడం లేదో తెలియజేసేందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల మధ్యకు వచ్చానని వెల్లడించారు. తనకు ప్రజాబలమేనని పేద ప్రజల బలంతోనే ముందుకు వచ్చాన పేర్కొన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో దొరలపాలనకు మంగళం పాడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement