కరీంనగర్: రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించామని, సానుకూల స్పందన వచ్చిందని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ భట్టాపురం మో హన్రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్లోని పెన్షనర్స్ భవన్లో రిటైర్డు ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని గత ంలో కోరగా కొన్నింటికి ఆమోదం లభించిందన్నా రు. త్వరలోనే మరిన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో మనమంతా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలి పించుకొని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందా మని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా, నగదు రహిత వైద్య సేవలందించేందుకు కృషి చేస్తానన్నా రు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మో సం అంజయ్య, ప్రధాన కార్యదర్శి దామెర మహేందర్ రెడ్డి, కోశాధికారి బూరుగుపల్లి నరేందర్, అసో సియేట్ అధ్యక్షుడు రాచ ఆనంద్, ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరేందర్ రెడ్డి, కార్యదర్శి రామచంద్రారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రిటైర్ట్ టీచర్లున్నారు.
మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి