కొండగట్టు, ధర్మపురిలో కలెక్టర్‌ ప్రత్యేక పూజలు | Sakshi
Sakshi News home page

కొండగట్టు, ధర్మపురిలో కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

Published Tue, Dec 5 2023 5:00 AM

కొండగట్టు ఆలయంలో కలెక్టర్‌ పూజలు - Sakshi

కొండగట్టు/ధర్మపురి: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామివార్లను జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సోమవారం దర్శించారు. అర్చకులు ఆమె గోత్రానామాలపై వేదమంత్రాలు చదివి తీర్థప్రసాదాలు అందజేశారు. ధర్మపురిలో ఈవో శ్రీనివాస్‌ స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలతో సన్మానించారు. కొండగట్టులో ఉపప్రధాన అర్చకుడు చిరంజీవస్వామి, అధికారులు పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తిధర రూ.6,750

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి ధర గరిష్టంగా రూ.6,750 పలికింది. సోమవారం మార్కెట్‌కు 116 వాహనాల్లో 1,486 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. క్వింటాల్‌కు మోడల్‌ ధర రూ.6,500, కనిష్ట ధర రూ.6,200 పలికింది. గన్నీ సంచుల్లో ముగ్గురు రైతులు 10 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.6,300, మోడల్‌, కనిష్ట ధరలు 6,100కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. కాగా మార్కెట్లో సీసీఐ సంస్థ 15మంది రైతుల నుంచి 216.30 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.7,020, మోడల్‌ ధర రూ.6,880 పలికింది. మార్కెట్‌ కార్యదర్శి గూగులోతు రెడ్డినాయక్‌ కొనుగోళ్లను పర్యవేక్షించారు.

వేలం పాడుతున్న వ్యాపారులు
1/1

వేలం పాడుతున్న వ్యాపారులు

Advertisement
Advertisement