సంబరాల్లో దివ్యాంగులు | Sakshi
Sakshi News home page

సంబరాల్లో దివ్యాంగులు

Published Fri, Dec 8 2023 1:12 AM

- - Sakshi

కరీంనగర్‌టౌన్‌: దివ్యాంగురాలు రజనీకి తొలి ఉద్యోగం ఇవ్వడంతో దివ్యాంగుల్లో ఆత్మగౌరవం పెరిగిందని తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మొగిలి లక్ష్మయ్య, నందగిరి జగదీశ్వరాచారి తెలిపారు. గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి రజనీకి ఉద్యోగం ఇచ్చిన సందర్భంగా ధన్యవాధాలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన రోజే ఉద్యోగ నియామకపత్రం ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లువెత్తుతుందన్నారు. తొమ్మిదేళ్లుగా ఎదురుచూసిన వారికి ఉద్యోగాలు వస్తాయనే ఆత్మవిశ్వాసం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పర్శరాములు, రాజన్న, కార్తీక్‌, రాములు, జక్కం సంపత్‌, వెన్నం శ్రీనివాస్‌, కొత్తూరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement