ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు | Sakshi
Sakshi News home page

ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు

Published Fri, Dec 8 2023 1:12 AM

కేక్‌ తయారు చేస్తున్న విద్యార్థులు  - Sakshi

కరీంనగర్‌: కిమ్స్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ముందస్తు క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కిమ్స్‌ విద్యా సంస్థల వైస్‌చైర్మన్‌ సాకేత్‌ రామారావు హాజరై మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు. కేక్‌ తయారీ విధానంలో అవసరమయ్యే వివిధ రకాల ఆల్కహాల్స్‌, డ్రై ఫ్రూట్‌ కలిపి, కేక్‌, మొదలైన తినుబండారాలు తయారు చేసే విధానం చూసి విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రిన్సిపాల్‌ అనూశ్‌రెడ్డి పాల్గొని దేశ విదేశాల్లో 125 పైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. అంతేకాకుండా హోటల్‌ మేనేజ్‌ మెంట్‌లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల గూర్చి విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో కిమ్స్‌ విద్యా సంస్థల డైరెక్టర్లు డా. శాలిని, సహజ, అధ్యాపక బృందం హరీశ్‌, యశ్వంత్‌, మనోజ్‌, సృజన, రజిత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement