చేగుర్తి ఇసుక క్వారీ రద్దు చేయాలి | Sakshi
Sakshi News home page

చేగుర్తి ఇసుక క్వారీ రద్దు చేయాలి

Published Thu, Dec 14 2023 12:48 AM

అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన 
నాయకులు - Sakshi

కరీంనగర్‌రూరల్‌: చేగుర్తిలోని ఇసుక క్వారీని రద్దు చేయాలని కోరుతూ బుధవారం అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌కు కాంగ్రెస్‌ నాయకులు వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్‌ మండలం చేగుర్తి, మానకొండూరు మండలం లింగాపూర్‌ గ్రామాల పరిధిలోని మానేరు వాగులో డి–సిల్టేషన్‌ పేరుతో ఇసుక క్వారీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు మూడు జేసీబీలను ఉపయోగించి పెద్దఎత్తున లారీల్లో ఇసుకను తరలిస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయినట్లు వివరించారు. మానేరు వాగులో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్‌జీటీ తీర్పు ఇచ్చినా.. అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారని తెలిపారు. భాషవేణి మల్లేశంయాదవ్‌, మూల వెంకటేశం, సంపత్‌కుమార్‌, సంజీవ్‌, గోపాల్‌, ఎల్లయ్య, వెంకటస్వామి, సురేందర్‌, రవీందర్‌రావు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement