నేడు గణిత దినోత్సవం | Sakshi
Sakshi News home page

నేడు గణిత దినోత్సవం

Published Fri, Dec 22 2023 1:38 AM

ప్రదర్శన తిలకిస్తున్న నరేందర్‌రెడ్డి - Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ–టెక్నో స్కూల్‌లో గురువారం ఏర్పాటు చేసిన అల్ఫోర్స్‌ మ్యాథ్స్‌ మెజెస్టి ఆకట్టుకుంది. మేధస్సుకు పదును పె డుతూ విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ప్రతిభకు పట్టం కట్టాయి. ఈ ప్రదర్శనలో భాగంగా మ్యాజిక్‌ మ్యాట్రిక్స్‌, రోబో సర్కిల్‌, క్యూబ్‌ బిల్డింగ్‌ వంటి నమూనాలు ఆలోచింపజేశాయి. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. శ్రీనివాస రా మానుజన్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రామానుజన్‌ దేశానికే ఆదర్శప్రాయుడని, నేటి తరానికి గొప్ప మార్గదర్శుకులని కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నేడు గణిత దినోత్సవం

శ్రీశ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకొని కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ–టెక్నో స్కూల్‌లో జాతీయ గణిత దినోత్సవాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్‌ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement