అభివృద్ధి పేరిట అప్పులు | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పేరిట అప్పులు

Published Fri, Dec 22 2023 1:38 AM

-

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కేవలం కమీషన్ల కోసమే అభివృద్ధి పేరిట గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు చేసిందని కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.సిరాజ్‌ హుస్సేన్‌ ఆరోపించారు. చేసిన అప్పులు ప్రగతికి నిదర్శనమని వారు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అప్పులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వాస్తవాలు చెబుతుంటే, తమ అవినీతి బయటపడుతుందనే భయంతోనే బీఆర్‌ఎస్‌ ఎదురుదాడికి దిగుతోందన్నారు. ప్రకృతి వరంగా లభించిన వనరులను, కాలానుగుణంగా పెరిగిన భూముల ధరలను తమ అభివృద్ధిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం దిగజారుడుకు నిదర్శనమని అన్నారు.

Advertisement
Advertisement