ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతిరావు | Sakshi
Sakshi News home page

ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతిరావు

Published Fri, Dec 22 2023 1:38 AM

తిరుపతిరావు - Sakshi

కరీంనగర్‌: ఇటీవల జరిగిన రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎన్నికల్లో రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధి గుడ్డేలుగులపల్లిలో పని చేస్తున్న పిన్నింటీ తిరుపతిరావు ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయినట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఆర్‌ శ్రీనివాస్‌, కట్టా రవీంద్రచారి తెలిపారు. గతంలో జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసి అనేక విద్య, ఉపాధ్యాయ రంగ సమస్యలపై పోరాటం చేశారని, వివిధ మండలాల నుంచి వచ్చే అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించారన్నారు. ప్రస్తుతం అనేక సమస్యల పట్ల వారి ఆలోచనలు సంఘానికి అవసరమని పేర్కొన్నారు. గతేడాది జరిగిన 75 వసంతాల సంఘ వజ్రోత్సవాల కార్యక్రమం ఘనంగా విజయవంతం కావటంలో వారి పాత్ర కీలకమని తెలిపారు. ఎన్నిక పట్ల జిల్లాలోని పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ.. సంఘం ఉన్నతి కోసం, విద్య, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఆర్‌ శ్రీనివాస్‌, కట్టా రవీంద్రచారి, రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు పర్వతరెడ్డి, సదానందంగౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement