కలల తెలంగాణ ఇంకా సిద్ధించలే: ఎంపీ సంజయ్‌ | Sakshi
Sakshi News home page

కలల తెలంగాణ ఇంకా సిద్ధించలే: ఎంపీ సంజయ్‌

Published Sun, Feb 4 2024 11:54 PM

-

కరీంనగర్‌టౌన్‌: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినప్పటికీ ప్రజలు కలకన్న స్వేచ్ఛాయుత వాతావరణం ఇంకా ఏర్పడలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఆర్టీసీ వర్క్‌షాపు సమీపంలోని పద్మశాలీ హాస్టల్‌లో ఎంపీలాడ్స్‌ రూ.10 లక్షలతో నిర్మించే భవన పనులకు భూమి పూజ చేశారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్‌ పాత్ర మరువలేనిదన్నారు. పద్మశాలీ సంఘం నేతలు ఆ సామాజిక విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అదనపు గదులకు అవసరం అయితే మరిన్ని నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement