ఎక్స్‌ప్లోరికా పాఠశాలలో వార్షిక క్రీడా దినోత్సవం | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్లోరికా పాఠశాలలో వార్షిక క్రీడా దినోత్సవం

Published Sun, Feb 11 2024 2:06 AM

రన్నింగ్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
 - Sakshi

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌లోని ఎక్స్‌ ప్లోరికా పాఠశాల వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు శనివారం పద్మనగర్‌ పారమిత హెరిటేజ్‌ క్రీడా మైదానంలో ఖేలో కూదో మౌజ్‌ మనావో పేరిట ఘనంగా జరిగాయి. పారమిత విద్యా సంస్థల చైర్మన్‌ ప్రసాద్‌రావు క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్రిల్‌, మార్చ్‌ ఫాస్ట్‌, సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రసాద్‌రావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, అనూకర్‌రావు, రాకేశ్‌, ప్రాచీ, వినోద్‌రావు, ప్రసాద్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శర్మిష్ఠబసు, సమన్వయకర్తలు బల్వీర్‌ కౌర్‌, శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, పీఈటీలు ప్రశాంత్‌, ప్రవీణ్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement