కరీంనగర్క్రైం: కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధూంపూర్లోని ఓ ఇంట్లో శనివారం విద్యుత్షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగ్ధూంపూర్లోని మేకల పోచాలు ఇంట్లో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్సర్క్యూట్ జరిగి మాటలు చెలరేగాయి. ఇంట్లోని బట్టలు, వంట సామగ్రితో పాటు పలు వస్తువులు కాలిపోయాయి. స్థానికులు ఫైరింజన్కు సమాచారం అందించడంతో ఫైర్ అధికారులు, సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని స్టేషన్ ఫైర్ అధికారి పరమేశ్వర్ తెలిపారు.
చెట్టును తొలగించిన వారిపై కేసు
కరీంనగర్క్రైం: గాంధీనగర్లోని ఒక వైన్స్ ఎదుట హరితహారంలో భాగంగా పెట్టిన చెట్టును, ఫెన్సింగ్ను తొలగించిన గుర్తు తెలియని వ్యక్తిపై కరీంనగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కరీంనగర్ కార్పొరేషన్ హరితహారం రిసోర్స్పర్సన్ ఎన్నమనేని విద్యాసాగర్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.