కులవృత్తులకు ప్రోత్సాహం | Sakshi
Sakshi News home page

కులవృత్తులకు ప్రోత్సాహం

Published Sun, Feb 11 2024 2:06 AM

అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న మేయర్‌ సునీల్‌రావు - Sakshi

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు మేయర్‌ సునీల్‌రావు తెలిపారు. శనివారం నగరంలోని 34వ డివిజన్‌ గోదాంగడ్డ దోభీఘాట్‌లో సీసీ ఫ్లోరింగ్‌ పనులకు శంఖుస్థాపన చేశారు. ఆత్మగౌరవంతో కులవృత్తులు చేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రజక కులవృత్తిని ఆధునీకరించి, మోడ్రన్‌ దోభీఘాట్‌ నిర్మించినట్లు తెలిపారు. ఈ మోడ్రన్‌ దోభీఘాట్‌తో రజకులు తమ కులవృత్తిని చేసుకోవడం సులువుగా మారిందన్నారు. త్వరలోనే నగరంలోని పాతబజార్‌లో మరో మోడ్రన్‌ దోభీఘాట్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. కాగా మోడ్రన్‌ దోభీఘాట్‌పై రూ.50 లక్షలతో షెడ్‌ నిర్మించాలని సహకార సంఘం సభ్యులు కోరిన మేరకు పరిశీలిస్తామన్నారు. విద్యుత్‌కు సంబంధించి రూ.28 లక్షల నిధులు నగరపాలకసంస్థ తరఫున చెల్లించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ షకీరా అంజూమ్‌ బర్కత్‌ అలీ, మడలేశ్వర సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement