ఘనంగా నృసింహస్వామి కల్యాణం | Sakshi
Sakshi News home page

ఘనంగా నృసింహస్వామి కల్యాణం

Published Thu, Feb 22 2024 1:40 AM

స్వామివారిని పల్లకిని మోస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు   - Sakshi

సారంగాపూర్‌: బీర్‌పూర్‌లోని లక్ష్మీనృసింహస్వామి కల్యాణం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికను వివిధ పుష్పాలతో అలంకరించారు. ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య వేదికపైకి తీసుకొచ్చారు. వివిధ గ్రామాల నుంచి వందలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. స్వామివారిని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దర్శించుకున్నారు. ట్రాన్స్‌కో డీఈ రాజిరెడ్డి దంపతులు, ఏడీఈ హరీశ్‌, బీర్‌పూర్‌, సారంగాపూర్‌ తహసీల్దార్లు నరేశ్‌, రమేశ్‌, ఎంపీపీ మసర్తి రమేశ్‌, జెడ్పీటీసీ పాత పద్మ, వైస్‌ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్‌రావు, విండో చైర్మన్‌ పొల్సాని నవీన్‌రావు, ఆలయ చైర్మన్‌ సామ్రాట్‌, ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌, ఈవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement